వైసీపీ గుండాలకు భయపడాల్సిన అవసరం లేదు: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లి: వైఎస్ఆర్సిపి గుండాల ఉడత బెదిరింపులకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు అర్ధరాత్రిలో కష్టం వచ్చినా అందుబాటులో ఉండి వాటిని పరిష్కరిస్తానని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామంలో వైసీపీ నాయకులకు భయపడాల్సిన అవసరం లేకుండా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడప సురేంద్ర, ఐటీ విభాగం నాయకులు జగదీష్, లక్ష్మీనారాయణ, రాజేష్ కుమార్, రెడ్డమ్మ, జనార్ధన్, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ప్రదీప్, రామసముద్రం మండలం అధ్యక్షలు చంద్ర శేఖర్, మదనపల్లి రూరల్ అధ్యక్షలు గ్రానైట్ బాబు, లక్ష్మిపతి, నాగవేణి, రేణుక, కుమార్ తదితరులు పాల్గొన్నారు.