వచ్చే నెలలో 2,397 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ : మంత్రి ఆదిమూలపు సురేష్‌

విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ చేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. 2021-22కు మొత్తం 10,143 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వదులుతామని చెప్పారు. డిగ్రీ కాలేజీల్లో 240 లెక్చరర్‌ పోస్టులకు వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు.