ప్రమాదవశాత్తు గాయపడ్డ కుటుంబాలకు ఎన్.ఆర్.ఐ జనసేన ఆర్థిక సహాయం

మదనపల్లె, మార్చి నెలలో చిత్తూరు జిల్లాలో ప్రమాదవశాత్తు గాయపడ్డ కుటుంబాలకు అమెరికా ఎన్.ఆర్.ఐ జనసేన లక్షా యాభై వేల 150000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఎన్. ఆర్. ఐ జనసేన అందించిన చెక్కులను బాధిత కుటుంబాలకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ అందజేసారు. అనంతరం పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీమతి రంగిశెట్టి శైలజ, అనిశెట్టి స్వామి, వారి మిత్ర బృందానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

జనసేన పార్టీ మదనపల్లె నియోజగవర్గ జనసేన కార్యకర్త కంభం మధు మార్చి నెలలో జరిగిన చిత్తూరు కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరి ప్రసాద్ మరియు రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్ దాస్ చౌదరి పరామర్శించి.. అమెరికా ఎన్.ఆర్.ఐ జనసేన తరుపున శ్రీమతి రంగిశెట్టి శైలజ, అనిశెట్టి స్వామి మరియు వారి మిత్ర బృందం తరుపున, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల శివరాం, శ్రీమతి దారం అనిత, రాయల దక్షిణకోస్తా పార్లమెంటరీ కమిటీ సభ్యులు మై ఫోర్స్ మహేష్, రాష్ట్ర చేనేత విభాగం కమిటీ సభ్యులు అడపా సురేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జెల రెడ్డెప్ప, మదనపల్లె పట్టణ పట్టణ కమిటీ సభ్యులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.