ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం: ఎం. హనుమాన్

  • ఇలాంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం బయటకు రాడా ??
  • జనసేన రాష్ట్ర నాయకులు హనుమాన్

ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందని జనసేన రాష్ట్ర నాయకులు మరియు న్యాయవాది హనుమాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ మాట్లాడుతూ 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి తరుపున, పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతుల మహేష్ గారి తరఫున జనసేన పార్టీ నాయుకులు, వీరమహిళలు, జనసైనికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరుపున నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఇలాంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం బయటకు రాడా ??. ఏపీకి చెందిన 178 మందిలో ఒక ట్రైన్లో, మరో ట్రైన్లో 58 మంది తిరిగి సహాయం కొరకు వెళ్లిన ఏపీ బృందం తమ వారి యోగక్షేమాలు తెలియకుండా అల్లాడుతున్న తెలుగు ప్రయాణికులు కనీసం వారి సమస్య గురించి పట్టించుకోని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే అందులో మరణించిన ప్రతి ఒక్కరు కుటుంబాలుకు ఒడిశా రాష్ట్ర గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ తరుపున ఆదుకోవాలని వారి కుటుంబాలకి ఆర్ధిక సహాయంతో పాటుగా ఇంట్లో వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని హనుమాన్ విజ్ఞప్తి చేశారు, అలాగే యాక్సడెంట్ కు గురైన తెలుగు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాధిత ప్రయాణీకులకు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు, సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలని హనుమాన్ కోరారు.