అంబటి పై నిప్పులు చెరిగిన చేగొండి

ఆచంట: ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలు శృతి మించుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు పై విరుచుకుపడ్డారు. క్యారెక్టర్ లేని ప్రతీ ఒక్కరూ పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేయడమే తద్వారా ఫేమస్ అవ్వాలని తహతహలాడుతున్నారు. మీ ప్రతిభ నోరు పారేసుకోవడం లో కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నడపడానికి చూపించండి. వైసీపీ పై మీ విశ్వాసం కుక్కని మించి ఉంది కుక్కకి బిస్కెట్లు వేసినట్లు నీకు పోలవరం ప్రాజెక్టు ని బిస్కెట్ లా వేసాడు జగన్ రెడ్డి అందుకని జగన్ రెడ్డి కి కట్టప్పలాగా మారిన రాంబాబు ఏనాటికైనా జగన్ రెడ్డి ని వెన్నుపోటు పొడిచేది అంబటి రాంబాబే, 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నీలాంటి వారి బతుకులన్నీ చదివేసాను నువ్వేంటో నీ బతుకేంటో కాంగ్రెస్ పార్టీ నాటి నుండి నాకు తెలుసు అన్నీ బయటపెడితే నిన్ను మంత్రి గా కాదు కదా కనీసం మనిషి లాగా కూడా ఎవరూ చూడరు అసలు నీ ఆస్తులెంత, నువ్వు దోచుకున్నదెంత? అందులో దాచుకున్నదెంతో ప్రజలకు చెప్పగలవా? అంటూ పవన్ కళ్యాణ్ ని మరోసారి తప్పుడు విమర్శలు చేస్తే మర్యాద దక్కదు మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటున్నారు మీరు ఒక్కొక్క పెళ్లి చేసుకుని వందల మందితో నడుపుతున్న భామాకలాపాలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా రాజకీయ విమర్శలు చేస్తే పర్లేదు కాని వ్యక్తిగత విమర్శలు చేస్తే జనసైనికులు చూస్తూ ఊరుకోరు మీ ఓటమి కి కంకణం కట్టుకున్నారు. స్థాయి మరచి మాట్లాడితే రాజకీయ సమాధి చేయడం ఖాయం, మీకున్న ప్రావీణ్యానికి అనుభవానికి మీకు రాసలీలల శాఖ మంత్రి భాద్యతలు అప్పగించాలి. మీతో పాటు బందరు కుక్కకి కూడా చెబుతున్నా పవన్ కళ్యాణ్ మామూలు కారు లో పర్యటిస్తుంటేనే రక్షణ కల్పించలేని ప్రభుత్వం పై నమ్మకం లేక ఆయన రక్షణ కోసం రెడీ చేసిన వారాహి వాహనం పై విమర్శలు చేస్తున్నారు. నువ్వు నీ ప్రాంతం లో పర్యటిస్తే నిన్ను ఊరకుక్కలు కూడా పట్టించుకోవు కాని పవన్ కళ్యాణ్ స్థాయి వేరు ఆయనకున్న ప్రజాకర్షణ, ప్రజాదరణ ఎవరికీ లేదు అందువల్లే ఆయన ప్రజల్లోకి వస్తుంటే స్వచ్చందంగా లక్షలాది మంది ప్రజలు ఆయనవద్దకు వస్తుంటారు దాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని దుష్టశక్తులు చేసే కుటిల ఆలోచనలను కట్టడి చేయడానికే ఆ వాహనాన్ని తయారు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కాపులే మిమ్మల్ని చెత్త చెత్తగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు జాగ్రత్త, ఖబడ్దార్ అంటూ ధ్వజమెత్తారు.ఈ పాత్రికేయ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ బోనం చినబాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, ఆచంట నియోజకవర్గ నాయకులు జవ్వాది బాలాజి, యర్రగొప్పుల నాగరాజు, గుడాల రాజేష్,కోయ కార్తీక్, పాలకొల్లు నియోజకవర్గ నాయకులు, డేగల సత్తికొండ, పితాని వెంకటేష్, అంబటి విజయ్ కుమార్, జుత్తుగ రియా పాల్గొన్నారు.