వన్‌ సన్‌, వన్‌ వరల్డ్‌, వన్‌ గ్రిడ్‌.. గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన

సౌరశక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ, కరెంట్‌ కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయడమే లక్ష్యంగా ‘వన్‌ సన్‌, వన్‌ వరల్డ్‌, వన్‌ గ్రిడ్‌’ ప్రాజెక్టును భారత్‌ ఆవిష్కరించింది.

ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌26 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని పరిమితం చేస్తూ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. సౌర ప్రాజెక్టులు ఏయే ప్రాంతాల్లో నిర్మించాలన్న విషయాలను తెలియజేసే ‘సోలార్‌ కాలిక్యులేటర్‌’ యాప్‌ను ఇస్రో త్వరలో తీసుకురానున్నట్టు తెలిపారు. అన్ని దేశాలు ఈ యాప్‌ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు.