కొనసాగుతున్నజనశ్రేణుల జనసేవ

వేడుకలకు దూరంగా కరోనా బాధితులకు అండగా ఉంటాం అంటూ ప్రారంభమైన జనసేన పార్టీ జనసేన కార్యక్రమం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకాకొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ప్రాణం పోయిన తరువాత 15 వేలు ఇస్తే, 10 వేల వ్యయంతో ఆక్సిజన్ సిలెండర్ల తో ప్రాణం పోస్తాo అని జనసేన నాయకులు శ్రేణులు, అభిమానులు ముందుకు వచ్చారు. ఆగస్టు 27న మొదటి విడతగా 341 రాష్ట్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రాలకు అందించారు. ఈ ప్రాణవాయువు అందించే కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదినం సందర్భంగా బుధవారం కూడా కొనసాగించారు. ఈ కార్యక్రమానికి స్థానిక జననేత నాయకులు కార్యకర్తలతో పాటు ఎన్ఆర్ఐ విభాగం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న జనసైనికులు కూడా తమ వంతు సహకారం అందించారు సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని పలు నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ అందించారు. రెండోవిడత 280 ఆక్సిజన్ సిలిండర్ తో కూడిన యూనిట్లు తమ తమ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేశారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణవాయువును అందించే ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు జన్మదినోత్సవం సందర్భంగా రెండో విడతగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 91 ఆక్సిజన్ సిలిండర్ యూనిట్లు ఆయా ప్రాంతాల్లోని కోవిడ్ఆసుపత్రులకు అందజేశారు. గోదావరి జిల్లాలో 45 యూనిట్లు, విశాఖలో 31 యూనిట్లు, గుంటూరులో 15, కృష్ణ, ప్రకాశం, కడప, జిల్లాలో 6 యూనిట్ల చొప్పున మరియు శ్రీకాకుళం, నెల్లూరు, జిల్లాలో 5 చొప్పున మెడికల్ సిబ్బందికి జనసేన నేతలు అందించారు. హైదరాబాద్ నగరంలో 70 యూనిట్లను జనసేన గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కార్యకర్తలు సమకూర్చారు. ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో ఒక్క ప్రాణం కూడా రాదు అన్న లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు వెళుతోంది ప్రభుత్వ పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్లు వెంటిలేటర్లు కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి బుధవారం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు జనసైనికులు బహుముఖమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.