గిరిజనుల సమస్యలపై గళం విప్పండి: కొర్ర కమల్ హాసన్

ఎంపీ మాధవి గారు.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మీరు చేస్తున్న పరిపాలన విధానం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి లో కానీ.. అరకు ఆసుపత్రి లో కానీ సరైన సదుపాయం లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వుతున్నారు. అలాగే ఇక్కడ సరైన చికిత్స లేక కే.జి.హెచ్ హాస్పిటల్ కి పంపిస్తుంటే గిరిజనుల సమస్యలు తెలుసుకొని హాస్పిటల్ సందర్శించే బాధ్యత మీకు లేదా?.. గిరిజనుల సమస్యలను పై ఏ రోజైన మీ ప్రభుత్వం దగ్గర మీ గళం విప్పిన దాఖలాలూ లేవు. తక్షణమే గిరిజనుల, సామాన్య ప్రజలు ఆసుపత్రిలో పడుతున్న ఇబ్బందుల పై మీరు గళం విప్పాలని ప్రజాసౌమ్య దేశంలో.. ఒక బాధ్యతగల పౌరుడిగా, నిజాయితీగల జనసైనికుడిగా అరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటివ్ కమిటీ మెంబెర్ కొర్ర కమల్ హాసన్ ప్రశ్నించారు.