వైరా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్‌గా ఓయూ నేత సంపత్ నాయక్

ఏన్కూరు: జనసేన పార్టీ వైరా అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా తేజవత్ సంపత్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంపత్ నాయక్ కి నియామకపత్రాన్ని అందించారు. ఆయన ఈ పదవిలో సంవత్సరం కాలం పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఏన్కూరు మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ, కొవ్వూరి మహేష్, దామెర్ల అశోక్ కుమార్, చుంచు భాస్కర్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మద్దెల పవన్ కళ్యాణ్, భాగం రవి, బీసీ సెల్ కోఆర్డినేటర్ పడిమల మురళీకృష్ణ, పసుపులేటి కృష్ణ, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ బోజగాని సురేష్, ముక్తి సతీష్, మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ యాకూబ్ పాషా, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాశం భరత్, బూరుగు రాము తదితరులు పాల్గొన్నారు.