మన ఊరు, మన వాడ, మన జనసేన

విజయనగరం నియోజకవర్గం: మన ఊరు, మన వాడ, మన జనసేన (22 గ్రామాలు మరియు 50 కార్పొరేట్ డివిజన్లు.) కార్యక్రమంలో భాగంగా.. విజయనగరం నియోజకవర్గం స్థానిక 32 వ డివిజన్ తోటపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి చేతుల మీదుగా జనసేన నాయకులు బూర్లీ వాసు. శ్రీకాంత్ సమక్షంలో స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద విశ్రాంత సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ విజయనగరం ఇంచార్జి సానక సుబ్రహ్మణ్యం, ఐ.టీ విభాగం బెల్లాన శివ, జనసేన నాయకులు కొర్నాన రామకృష్ణ, దాసరి యోగేష్, బొబ్బాధి చంద్ర నాయుడు, రామతోట రాజేష్, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.