జనసేన ఆధ్వర్యంలో గోలిగేశ్వర కుమార సుబ్రహ్మణ్య స్వామివారికి పాలాభిషేకం

అనపర్తి, బిక్కవోలు మండలం బిక్కవోలుగ్రామంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం గోలిగేశ్వర కుమార సుబ్రహ్మణ్యం ఆలయంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ఆలయ ప్రాగాణములో ఉన్న శివలింగానికి టెంట్ తాళ్లు కట్టడం జరిగింది. ఈ చర్యను ఖండిస్తూ అనపర్తి నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో స్వామివారికి పాలాభిషేకం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీర మహిళ కాశీరాణి, వెంకటలక్ష్మి జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు విష్ణు బిక్కవోలు మండల జనసైనికులు అనపర్తి మండలం అధ్యక్షులు, రంగంపేట మండల జనసేన అధ్యక్షులు, పెదపూడి మండల జనసేన అధ్యక్షులు మరియు నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.