పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 23వ రోజు కార్యక్రమం

నాగర్ కర్నూల్: సోమవారం బిజినపల్లి మండలం వసంతాపుర్ గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులతో, జన సైనికులతో కలిసి పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ, కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు వంగ విజయ్ భాస్కర్ గౌడ్, ప్రసాద్, సూర్య, రాజు నాయక్, వంశీ రెడ్డి, శివ, దన్నే రమేష్, రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు.