పొత్తు ధర్మంలో భాగంగా బండారు శ్రావణిశ్రీ కి మద్దతుగా పల్లె పల్లెకూ జనసేన: తోట ఓబులేసు

సింగనమల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ మరియు ఉమ్మడి ఎంపీ అంబిక లక్ష్మీ నారాయణల ఎన్నికల ప్రచారం సింగనమల మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తోట ఓబులేసు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సింగనమల మండల పరిధిలోని లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, మదిరేపల్లి, గురుగుంట్ల గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీలకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ప్రజలను కోరడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఓటు వేసేది సైకిల్ గుర్తుపైనే అని ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేస్తామని అభ్యర్థినీ గెలిపిస్తామని తెలియజేశారు. అనంతరం తోట ఓబులేసు మాట్లాడుతూ అనంతపురం ఉమ్మడి ఎంపీ మరియు సింగనమల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిల గెలుపు కోసం మండల వ్యాప్తంగా మరియు నియోజకవర్గ వ్యాప్తంగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట రామ మోహన్, నరసప్ప, అశ్వర్థం, మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు.