గుండెల్లో పవన్ … గోడలపై జగన్

చంద్రగిరి, గుండెల్లో పవన్… గోడలపై జగన్ అనే సరికొత్త నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు జనసేన చంద్రగిరి నేత దేవర మనోహర్. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు సాయం చేసి వారి కుటుంబాల్లో పవన్ కళ్యాణ్ నిలిచిపోతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో జగన్ వైసీపీ గోడలపై వెలిసిపోయాడని ఎద్దేవా చేశారు. ఎలాగూ ప్రజల గుండెల్లో స్థానం లేదని గుర్తించిన జగన్ కనీసం వారి గోడలపై అయినా ఉంటే గుర్తుపెట్టుకుంటారని స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చలోక్తులు విసిరారు. చంద్రగిరిలో జరిగిన మీడియా సమావేశంలో దేవర మనోహర మాట్లాడుతూ… జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో పచ్చబొట్టుగా మారితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గోడలపై స్టిక్కర్ గా మారాడని ఎద్దేవా చేశారు. నవరత్నాలను అమలు చేయలేక ఒక్కో రత్నాన్ని కోల్పోతున్న జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 151 సీట్లను ఒక్కొక్కటిగా కోల్పోతాడని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల అవినీతిలో ర్యాంకింగ్స్ ప్రకటిస్తే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల మనిషిగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కు అవినీతి అక్రమాలతో ప్రజా వ్యతిరేక పరిపాలనతో ప్రజల గోడలపై స్టిక్కర్ గా మారిన జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందన్నారు దేవర మనోహర. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరి సంజీవి, శేఖర్, సంగీతం కిరణ్ మరియు వీరమహిళా విభాగం శ్రీమతి ఆశ, శ్రీమతి లావణ్య పాల్గొన్నారు.