బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్: ఏపీ శివయ్య

రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏపీ శివయ్య మాట్లాడుతూ జనసేన పార్టీని పూతల పుట్టు నియోజకవర్గంలో అత్యున్నత స్థానం తీసుకెళ్తామని పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఏపీ శివయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాధ్యక్షులతో మరియు జన సైనికులు కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాను పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత చిత్తూరు జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి ఎల్లవేళ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి మురిరాజు, యాదమూరు మండల అధ్యక్షులు కుమార్ మరియు కమిటీ సభ్యులు, ఐరాల మండల అధ్యక్షుడు పురుషోత్తం, మండల ఉపాధ్యక్షులు శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి తులసి బాబు, మండల యువ నాయకులు వినయ్, మండల కార్యదర్శి సింగంశెట్టి గిరి, మండల కమిటీ సభ్యులు, అదే విధంగా బంగారు పాల్యం మండలాధ్యక్షులు కోడి చంద్ర, ఉపాధ్యక్షులు బాలు, శివ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శాంతమూర్తి, యువ నాయకుడు కిషోర్, కమిటీ సభ్యులు తవణంపల్లి మండలాధ్యక్షుడు రాజశేఖర్, ఉదయ్ లోహిత్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మోహన్ కమిటీ సభ్యులు, పూతలపట్టు మండల అధ్యక్షులు బండారి మనోహర్ మరియు మండల కమిటీ సభ్యులు చంటి పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మండలాధ్యక్షులకి మండల కార్యవర్గ సభ్యులకి జిల్లా కమిటీ సభ్యులకు ఏపీ శివయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అదే విధంగా ఐరాల ప్రధాన కార్యదర్శి వాసు రాయల్ పాల్గొన్నారు.