ప్రతిపక్షాలపై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన పితాని

ముమ్మిడివరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేందుకు సిద్దమైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని లా అండ్ ఆర్డర్ పేరుతో అడ్డు కోవడం చాలా హేయమైన చర్య అని ఆంద్రప్రదేశ్ రాకుండా పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం దుర్మార్గం అని ఖండించారు. ఇది ప్రభుత్వం అధికార అహంకారానికి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు తిరగకుండా అడ్డుకోవడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు నాయుడును ఒక ఉగ్రవాదిలా అర్ధరాత్రి వందలాదిమంది పోలీసులతో అరెస్టు చేయడం హెయమైన చర్య అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఒక ఆర్దిక ఉగ్రవాది, అని అతనిపై అనేక సి.బి.ఐ, ఈ.డి కేసులు ఉన్నాయని అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఆంద్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని పితాని తీవ్రంగా విమర్శించారు.