మలిశెట్టి ఆధ్వర్యంలో పవనన్న ప్రజా బాట

  • పవనన్న ప్రజా బాట 125వ రోజు
  • రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పట్టణం ఆకుల వీధి, కొలిమి వీధి, బండ్రాలు వీధి, గ్రామంలో జనసేన రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం 125వ రోజు పవనన్న ప్రజా బాటకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి జనసేన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్య పంతులు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేసి జనసేన పార్టీని అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు గుండా రాజకీయాలు దోపిడీలు చేస్తూ వైకాపా పాలన కొనసాగుతుందని తెలిపారు ఎదురు తిరిగిన వారిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని వివరించారు.ఈసారి మళ్లీ జగనే అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలు బతకలేరని వివరించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి శ్రీనివాసులు, కొత్తూరు వీరయ్య ఆచారి , గోపి, నారా కిషోర్ , జనసేన వీరమహిళలు జడ్డ శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.