ములకలపల్లి మండలంలో పవన్ జన్మదిన వేడుకలు

అశ్వారావుపేట నియోజకవర్గం: జనసేన అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ములకలపల్లి మండలంలో జనసేన మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జ్ డేగల రామచందరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ప్రతి ఎన్నికల్లో జనసేన పోటీలో ఉంటుందని, గ్రామాల్లోని ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని కోరారు. అలాగే మండలంలో 18 సంవత్సరాలు నిండిన యువత యువకులు ఓటు రిజిస్టర్ చేయించుకునేల ప్రతీ కార్యకర్త కృషి చెయ్యాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో పాదయాత్ర చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, గొల్లా వీరబద్రం, కందుకూరి వినీత్, బొక్కా వెంకటేశ్వరరావు, కోండ్రు నాగెంద్రబాబు, నూతి సాయికుమార్ మోటా సుధాకర్, చైతన్య, నియోజకవర్గ నాయకులు ఇనుకుర్తి రాము, రఫీ పాషా, నాగరాజు నాయక్, నక్కన రమేష్, బోలగాని పవన్ కళ్యాణ్, పుప్పాల ఉదయ్ , బాదావత్ రవికుమార్, గోపగాని సాయి ప్రకాష్, మానితాల శివప్రసాద్, ప్రశాంత్, మచ్చ శ్రీను, బాడిస వేణు, సున్నం నాగబాబు, మచ్చ వెంకటేష్, ప్రవీన్, మడకం రామకృష్ణ, అజిత్, దితరులు పాల్గోన్నారు.