జనసేన జండా ఆవిష్కరించిన పెందుర్తి నియోజకవర్గ జనసేన

పెందుర్తి నియోజకవర్గం, నరవ గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ వసంత లక్ష్మి, వీరమహిళ పార్వతి, జిల్లా నాయకులు గోపికృష్ణ చేతుల మీదగా జండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ తో పాటు.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పేదవాళ్లకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మీడియా ప్రతినిధులతో వసంత లక్ష్మి మాట్లాడుతూ సోమవారం జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవమునకు.. చలో అమరావతి ఇప్పటం గ్రామానికి అందరూ తరలి వెళ్లాలని.. అక్కడికి వెళ్లలేని ప్రజలు టీవీలో స్పీచ్ ఆలకించి రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక వైపు అడుగులు వేయాలని.. నరవ గ్రామంలో జండా ఆవిష్కరణలో నన్ను భాగస్వామిని చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ.. జనసైనికులు అందరూ ఐకమత్యంగా అధ్యక్షుల వారిని ముఖ్యమంత్రి చేసేవరకు శ్రమించాలని కోరడం జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ.. నియోజవర్గం సమన్వయకర్త తమ్మీరెడ్డి శివశంకర్ సూచన మేరకు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలో మండలాలకు ‘చలో అమరావతి’ ఇప్పటం గ్రామం సభకు బస్సులు వేయడం జరిగిందని.. ప్రభుత్వం జనసేన పార్టీ సభకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా.. ప్రజలు జనసేన వైపు నిలబడ్డారు అని, ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని, మనమందరం ప్రజల సమస్యల వైపు నిలబడాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి. శ్రీనివాస్, శేఖర్, లక్కీ గోవింద్, జుత్తాడ శ్రీనివాస్, అప్పు, రవిబాబు గవర శీను, బొడ్డు నాయుడు, ప్రవీన్, చిన్న, అశోక్, నవీన్ మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.