స్థానిక సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కి జనసేన పార్టీ తరుపున వినతి పత్రం

జగద్గిరిగుట్ట డివిజన్ లో స్థానికంగా ఏర్పాటుకి సిద్ధమైన బస్తీ దవాఖాన విషయంలో అధికారులు మరోసారి ఆలోచించి, మీ సేవా కేంద్రంలో బస్తీ దవాఖాన ఏర్పాటుతో పాటు, రాజీవ్ గృహకల్ప ప్రాంగణంలో ఉన్న మోడల్ మార్కెట్ భవనంలో ఉన్నటువంటి విశాలమైన స్థలంలో కూడా ఏర్పాటు చేయాలని, అదే విదంగా స్థానికంగా జరుగుతున్న ప్రభుత్వ అక్రమ భూ కబ్జాలను అరికట్టాలని జనసేన హైదరాబాద్ సెక్రెటరీ నందగిరి సతీష్ కుమార్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.