రైతులకు ధాన్యం మద్దతు ధర పెంచాలని వినతిపత్రం

  • రాజోలు మండలం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వారికి, రైతులకు వారి మద్దతు ధర పెంపు మరియు మద్దతు ధర నగదు రైతు ఖాతాలో సకాలంలో జమ చేయుట గురించి వినతి పత్రం.

రాజోలు, రాజోలు మండలంలోని దాళ్వా పంట రైతుల యొక్క ఈ క్రింది సమస్యలను తమకు తెలియజేసి మీయొక్క పరిధిలోని విషయంలో తగు పరిష్కారం చూపిస్తూ కలగాలని ఆశిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తారని…

1) ఒక 75 కేజీల ధాన్యం పండించుటకు వరి విత్తనం నాటి నుండి కోత కోసే వరకు అయ్యే ఖర్చు 2200 రూపాయలు పెట్టుబడి అవుతుంది కానీ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర కేవలం 1470 రూపాయలు ఇస్తున్నారు.
2) గతంలో పోటస్, యూరియా ఎరువులు గతంలో పొటాష్ ధర 900 ఇప్పుడు పొటాష్ ధర 1700 రూపాయలు పెరిగాయి. గతంలో ఎరువుల ధర కంటే ఇప్పుడు పోలిస్తే దాదాపుగా 80 శాతం పెరిగాయి ఎరువులు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎరువులకు కూడా రైతులకు సబ్సిడీ ఇస్తే రైతులకు పెట్టుబడి తగ్గుతుందని కోరడం జరిగింది.
3) వ్యవసాయ యంత్ర పరికరాలు గ్రూప్ వారికి రైతుకు అందిస్తున్నారు. అవి అధికార పార్టీ వాళ్లకి చెందుతున్నాయి. బరకాలు, స్ప్రే మిషన్లు ఈ విధముగా యంత్ర పరికరాలు, రైతులకు స్వయంగా ఇచ్చిన ఎడల రైతులకు భారం తగ్గుతుంది
4) రైతులకు ధాన్యం కళ్ళాలు ఏర్పాటు చేయవలసిందిగా వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, మెరకపాలెం ఎంపిటిసి పున్నం నాగదుర్గ అధికారులను కోరడం జరిగింది.