పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, జి వేమవరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మద్దిం శెట్టి నాగలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామంలో అనారోగ్యంతో మరణించిన పోలిశెట్టి అన్నపూర్ణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మద్దిం శెట్టి పురుషోత్తం, లంకలపల్లి జమ్మి, కర్రీ శేఖరు, లంకినపల్లి వెంకటేశ్వరరావు, రామకృష్ణ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.