కేసనకుర్రు గ్రామంలో పితాని సుడిగాలి పర్యటన

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, కేసనకుర్రు గ్రామంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సలాది లక్ష్మణ్ ఇంట జరిగిన వీరభద్రుని సంబరంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్న చిక్కం రాంబాబు ని, ఇటీవల యాక్సిడెంట్ లో గాయపడిన జనసేన యువ నాయకులు మల్లిపూడి రాజా ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.