కళ్యాణం రాజును పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం నరసింగపురం గ్రామానికి చెందినటువంటి కళ్యాణం రాజు ఇటీవల కొద్ది రోజులుగా నోటి క్యాన్సర్ తో బాధపడుతూ ప్రాణ భయంతో ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా నిరాకరిస్తూ ఇంట్లోనే అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ పోషణకు కూడా పలు ఇబ్బందులు పడుతున్నటువంటి కళ్యాణం రాజు పరిస్థితిని తెలుసుకున్న స్థానిక జన సైనికులు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ని కలిసి వారి యొక్క పరిస్థితి వివరించడం జరిగింది విషయం తెలుసుకున్న డాక్టర్ శ్రీధర్ మానవతా దృక్పథంతో చెల్లించి నరసింగపురం గ్రామంలో నివసిస్తున్నటువంటి కళ్యాణం రాజుని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుని జనసేన కుటుంబం మీకు అండగా ఉంటుందంటూ మనోధార్యాన్ని నింపి ఆపరేషన్ చేయించుకొనుటకు సంబంధిత డాక్టర్స్ తో ఫోన్లో మాట్లాడి తన యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆపరేషన్ కు తగు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా పంచాది వెంకటేష్, పంచాది వెంకటపతి, మోతి రమణ, మోతి సత్తిబాబు, పంచాది వెంకటరమణ, కళ్యాణం నాగేశ్వరరావు, పంచాది మధు, మోతి పెద్ద వీరన్న, పంచాది లీల మధు, మోటూరి మహేష్, కళ్యాణం అప్పారావు, నిండు కొండ రాజేష్, కళ్యాణం సత్తిబాబు, మోటూరి సత్యనారాయణ, కళ్యాణం ఈశ్వరరావు, కళ్యాణం మహేష్, గోటూరి నరసింహమూర్తి మరియు నరసింగపురం బేడ బుడగ జంగం జనసైనికులు, కందరాడ బేడ బుడగ జంగం జనసైనికులు పాల్గొనడం జరిగింది.