వరదబాదితులకు కూరగాయలు పంపిణీ చేసిన పోలవరం జనసేన

పోలవరం నియోజకవర్గ జనసైనికులు వేలేరుపాడు కుక్కునూరు మండలాల వరదబాదితుల సహాయార్ధం జనసేన పార్టీ ఆద్వర్యంలో నిత్యావసరాలు అంటే కూరగాయలు దాదాపు 25 టన్నులు 4000 కుటుంబాలకు అందిచడం జరిగింది. జనసైనికులు పెద్ద మొత్తంగా పాల్గొని ఈ వితరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసారు. కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితుల బాధ వర్ణనాతీతం. ఈ కార్యక్రమంలో ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యధర్శి కరాటం సాయి, జిల్లా కార్యధర్శి గడ్డమణుగు రవికుమార్‌, జిల్లా సంయుక్త కార్యధర్శి పాదం నాగకృష్ణ, ఏడు మండలాల అద్యక్షులు తోట రవి, తెల్లం రవిప్రసాద్, పసుపులేటి రాము, గుణపర్తి చిన్ని, అడపా నాగరాజు, ములిశెట్టియుగంధర్‌, గణేసుల ఆదినారాయణ, అప్పన ప్రసాద్‌, తాడేపల్లి గోపి మరియు భారీగా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసారు.