Vijayawada: పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పోతిన మహేష్

దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి ఇంటిని స్మారకచిహ్నంగా తీర్చిదిద్దేందుకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ 7వ డివిజన్, జనసేనపార్టీ, దళిత నాయకురాలు శ్రీ దోమకొండ మేరీ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్ మరియు నగర ఉపాధ్యక్షులు శ్రీ వెన్నా శివశంకర్, నగర ఉపాధ్యక్షులు శ్రీ కామల్ల సోమనాథం జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, నగర కమిటీ సభ్యులు, ధార్మిక మండలి సభ్యులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.