పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న గాదె

మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకురు గ్రామంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా ముటుకురు గ్రామ జనసేన పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ కరెంట్ ప్రభను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల, గురజాల నియోజకవర్గ జిల్లా నాయకులు, మండల అద్యక్షులు, గ్రామకమిటీ సభ్యులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.