అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ప్రమీలా ఓరుగంటి చేతుల మీదుగా ఆర్థిక సహాయం

ఆత్మకూరు: మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామ మనోహర్ సహాయ సహకారంతో బెడుసుపల్లి గ్రామానికి చెందిన మంచాల అఖిల అనే
బాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తెలుసుకుని బాలిక కు ఆర్థిక 5000 రూపాయలు ఆర్థిక సహాయం మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి చేతుల మీదుగా అందించడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి మాట్లాడుతూ వింత వ్యాధితో బాధపడుతున్న అ బాలిక ని దాతలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకార సహకారాలు అందించిన శ్రీరామ మనోహర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన, వెంకటేష్, పెంచలయ్య, కృష్ణ కుమార్, వెంకమ్మ, తిరుపతమ్మ, శ్యామ్ స్థానికులు పాల్గొన్నారు.