ప్రేమదేశం సీక్వెల్…త్వరలో అధికారిక ప్రకటన

టబు, వినీత్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లోప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ప్రేమదేశం. అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఓవైపు స్నేహం, మరోవైపు ప్రేమని కళ్ళకు కట్టినట్టు చుకొయించారు. తమిళంలో కాదల్ దేశం… పేరుతో రాగా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదల అయింది. ఎ.ఆర్.రహమాన్ సంగీతం… ముఖ్యంగా ముస్తఫా .. ముస్తఫా, నను నేను మరిచినా పాటలు విపరీతంగా అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవలే ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తిచేసుకోంది. కాగా తాజాగా స్పందించిన దర్శకుడు కదిర్ సీక్వెల్ పై మాట్లాడుతూ… ప్రేమదేశం సినిమాకు సంబంధించిన సీక్వెల్ కథపై చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే స్క్రిప్టు కూడా సిద్ధమైందని అన్నారు. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోలు, హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.