ఎక్కడ అయినా చర్చకు సిద్ధం: నిమ్మకాయల రాము

అనంతపురం, 2024 లో కాపులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ధైర్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉందా. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకుల సమావేశం కాపుల అభివృద్ధి గురించి జరిగిందా? కాదు ఇది కేవలం పవన్ కళ్యాణ్ మీద కాపు సామాజికవర్గం అనే ముద్ర వేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం. మీకందరికీ ఒకటే సవాల్ విసురుతున్నాం ఈ మూడున్నర సంవత్సరాలు కాలంలో కాపు యువతకి ఉన్నత విద్య, ఉద్యోగం, వ్యాపార అవకాశాల, రిజర్వేషన్స్ గురించి మాట్లాడటానికి నోరు రాదు ఒక్కడికి కూడా. పవన్ కళ్యాణ్ మీద ఏడవమంటే మేము కాపులం అని వచ్చేస్తారు. నీతివంతంగా మాట్లాడుకుందాం అంటే ఎక్కడ అయినా చర్చకు సిద్ధం ఎవరైనా కాపులకు. కనీసం అన్నీ పార్టీల కాపు రాజకీయ నాయకులతో చర్చకు ఏర్పాట్లు చేయండి.
చర్చ: ఇచ్చిన హామీలు – చేసిన పనులు
సిద్ధాంత పరంగా మాట్లాడమంటే వ్యక్తిగత విషయాల జోలికి వచ్చి అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ దూషిస్తున్నది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండు చోట్ల ఓడిపోయిన కూడా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పైన స్పందిస్తున్న తీరును ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పైన ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడిన నమ్మకం తట్టుకోలేక ఒక అభద్రత భావంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నీచమైన రాజకీయాలకు ఈ రాష్ట్ర ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము అన్నారు.