కాపు మంత్రులు పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మీకే మంచిది కాదు

పాలకొండ నియోజకవర్గం, రాజమండ్రిలో కాపు మంత్రుల మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? అని పాలకొండ నియోజకవర్గ కాపు నాయకులు, జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు.? ముఖ్యమంత్రి కాపులకు అన్యాయం చేస్తుంటే వైసీపీ కాపు ప్రతినిధులు ఏమి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలుస్తూ కాపుల ఆత్మగౌరవాన్ని జగన్ రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ప్రతినిధుల సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు చీకొడుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చాలని జగన్ రెడ్డిని ఎందుకు డిమాండ్ చేయడంలేదు? కాపులకు 5% రిజర్వేషన్స్ కోసం ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు. ప్రతీ సంవత్సరం కాపు కార్పొరేషన్ కు 2000 కోట్లు ఇస్తానని వాగ్దానం చేసి ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వని ముఖ్యమంత్రిని అడిగే దమ్ములేదా? కాపు నేస్తం అర్హులైన కాపులందరికి ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఎప్పుడైనా అడిగారా? వైసిపి కాపు బానిసల్లారా కాపులకు రాజ్యాధికారం రానివ్వరా? పాలకొండ నియోజకవర్గం నుండి మేము ఒక్కటే చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్న యావత్ కాపు జాతి పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తున్నారు అన్ని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ కాపు సంక్షేమసేన నియోజకవర్గ అధ్యక్షులు గొర్లె మన్మధ రావు, మత్స పుండరీకం, పోరెడ్డి ప్రశాంత్, కడగల హరికృష్ణ పాల్గొన్నారు.