కైకలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం

కైకలూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూడలేకే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మతిభ్రమించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇకపై పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే జనసేన సైనికులు చూస్తూ ఊరుకోం మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి కొడాలి నాని ముందుగా తమ నియోజకవర్గంలో ప్రజావ్యతిరేకత వారి మీద ఎంత ఉందో చూసుకోవాలని తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలి రాష్ట్ర మంత్రులు దాడిశెట్టి రాజా గుడివాడ అమర్నాథ్ ముందుగా తమ శాఖపై పట్టు తెచ్చుకోవాలని తర్వాత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే బాగుంటుందని దాడిశెట్టి రాజా ముందుగా తమ నియోజకవర్గంలో దొంగ బంగారం గంజాయి అక్రమ రవాణాపై ముందుగా మాట్లాడాలని అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ తన శాఖపై ఎంత పట్టు ఉందో చర్చికి రావాలని ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు గుడివాడ అమర్నాథ్ చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేష్ తన నోరుని అదుపులో పెట్టుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈనెల 25వ తేదీన చేనేత సభకు ఇస్తున్న సీఎంను నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కలిసి వినతిపత్రం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికలు ఇంచార్జిలు కొల్లి వరప్రసాద్ (బాబి), నల్లగోపుల చలపతి (నాని), జనసేన వీర మహిళ నాయకురాలు శ్రీమతి తోట లక్ష్మి, కైకలూరు మండలం ఉపాధ్యక్షురాలు శొంఠి రాజేశ్వరి (రాజీ), యువ నాయకులు ముత్యాల తరుణ్, కొటికలపూడి ఈశ్వర్ నాయుడు, తోట సంజయ్, ఘంటసాల జయంత్, తిరుమణి, యేసు, రాజు తదితరులు పాల్గొన్నారు.