కేదార్ నాథ్ లో ప్రధాని.. ప్రత్యేక పూజలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ కేదార్ నాథ్ లో పర్యటిస్తున్నారు. ముందుగా డెహ్రాడూన్ చేరుకున్న ఆయనకు రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం సుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి కేదార్ నాథ్ వెళ్లారు.

ప్రధాని మోదీ ఈ రోజు కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంత‌రం జగద్గురు ఆదిశంకరాచార్య సమాధిని ప్రధాని పునఃప్రారంభించనున్నారు. 2013 వరదల కారణంగా అప్ప‌ట్లో  స‌మాధి దెబ్బ‌తింది. కాసేప‌ట్లో ఆయ‌న‌ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.  సరస్వతి ఘాట్ తో పాటు 130 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన‌ ఇన్‌ ఫ్రా ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. మ‌రోవైపు, మోదీ కేదార్‌నాథ్‌ పర్యటన నేప‌థ్యంలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు దేశ వ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పారు.