బెంగాల్ నవరాత్రుల వేడుకలో పాల్గొననున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12గంటలకు పశ్చిమ బెంగాల్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్‌ బూత్‌లో పీఎం మోడీ వర్చువల్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని బీజేపీ సంకల్పించింది. సుమారు 78వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లోని ప్రతి బూత్‌లో 25 మందికిపైగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లు ప్రసంగాన్ని వినేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పూజోర్ శుబేచా(పూజా శుభాకాంక్షలు), కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై ఆ రాష్ట్ర ప్రజలతో అభిప్రాయాలను పంచుకోనున్నారు. దుర్గాపూజలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.