నేటి సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

జాతినుద్దేశించి సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. అయితే ఏ అంశాలపై చర్చిస్తారన్న సమాచారం లేనప్పటికీ.. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వీడనుండటంతో పాటు వ్యాక్సిన్ల కొరత, ఇతరత్రా సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇంచు మించు ఐదు రాష్ట్రాలు అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకోనుంది.