జనసేన నాయకుల నిరసన – అక్రమ అరెస్టు

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, పరిగి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులతో కలిసి ఇసుక రీచ్ రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకులు ధర్నా చేసి ఇసుక తోడుతున్న వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిజేస్తున్న జనసేన నాయకులను రైతు సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మడకశిర పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో పరిగి మండల అధ్యక్షులు సురేష్, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు రమేష్, పెనుకొండ నియోజకవర్గం నాయకులు అనిల్ కుమార్, రాజు కుమార్, మండల నాయకులు నాగేష్, పాపన్న, శివశంకర్, రామాంజి, వేణు, గిరీష్, మురళి, సిపిఎం నాయకులు లింగారెడ్డి, నాగరాజు, రైతుసంఘం నాయకులు తదితరులు ఉన్నారు.