మలికిపురంలో దస్తావేజు లేఖరుల నిరసన – జనసేన మద్దతు

రాజోలు నియోజకవర్గం: పూర్వం నుండి వస్తున్న భూమి దస్తావేజు స్టాంపులను నిలుపుదల చేయడం మరియు ఇప్పుడున్న స్టాంపు స్వరూపాన్ని మార్చి ప్రైమ్ 2.0 కంప్యూటర్ ఆన్ లైన్ ద్వారా నాసిరకం పేపర్ పై ఈ-మెయిల్ ప్రింటింగ్ ద్వారా రిజిస్ట్రీ పత్రం ఇవ్వాలనే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో లేఖర్లు మరియు సహాయకులు, స్టాంప్ వెండర్లు పెన్ డౌన్ కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, తాడి మోహన్, గుండుబోగుల పెద్దకాపు, కుసుమ నాని, రాపాక రమేష్ బాబు, అల్లూరి రంగరాజు, రావూరి నాగు, కాళిదాసు, లింగోలు మహాలక్ష్మి, కృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.