జనసైనికునికి ప్రమాద భీమా అందజేత

నెల్లూరు జిల్లా, ఆమంచర్లకి చెందిన తోకల శ్రీహరి జనసేన పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నాడు, దురదృష్టవశాత్తు గత అక్టోబర్ నెలలో బుచ్చిరెడ్డిపాలెం వద్ద ప్రమాదానికి గురై హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటికి చేరుకున్న పిదప జనసేన పార్టీ సభ్యత్వం కలిగిన వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే లభించే ప్రమాద భీమా నగదు 37 వేల రూపాయలను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, సుందర్ బాబు, తదితరులు తోకల శ్రీహరి నివాసానికి వెళ్లి చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో ఏ పార్టీకి లేని విధంగా ప్రమాద భీమా వర్తింప చేయడం ఒక జనసేన పార్టీకి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.