ప్రజా చైతన్య పోరాట యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ 6వ డివిజన్ రేచర్ల పేట ప్రాంతం నందు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటి సహాయ కార్యదర్శి కాంటా రవిశంకర్ మరియు డివిజన్ నాయకులు పచ్చిపాల మధు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పోరాట యాత్ర జరిగినది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలు ఎదురుకొంటున్న వివిధ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు ప్రజలతో కలిసి మాట్లాడుతూ ప్రభుత్వాలు అన్నవి ప్రజల సమస్యలను తీర్చేవిలా ఉంటాయనీ కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే ప్రజలు విస్తుబోతున్నారన్నారు. ఒకపక్క ప్రజలు అధిక విధ్యుత్ చార్జీలపై గగ్గోలు పెడుతున్నారనీ, పత్రికలలో చూస్తే విద్యుత్ సంస్థలు దివాలా తీసేంతగా నష్టాలలో ఉన్నాయని తెలుస్తోందనీ ముఖ్యమంత్రి తన వేరే ప్రయోజనాలకోసం అధిక ధరలకు బొగ్గు, విద్యుత్తు కొంటే సంస్థలకు నష్టాలు కాక మరేం మిగులుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వ అవినీతికి అంతేలేకుండా పోయిందనీ వీళ్ళను తరిమికొట్టకపోతే భవిష్యత్తు తరాలకు మిగిలేది శూన్యమే అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సుజాత, బోడపాటి మరియా, రమణమ్మ, ఉమా, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.