చెన్నై Vs పంజాబ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2020లో భాగంగా ఈ రోజు షార్జా వేదికగా మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం అటు చెన్నై అభిమానులు. ఐటీ పంజాబ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆది ఒక్క మ్యాచ్ గెలిచినా చెన్నై టీమ్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మరోవైపు పంజాబ్ కూడా వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి ఢీలాపడింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుసగా మ్యాచ్ లు ఓడిపోవడంతో ఈ మ్యాచ్ గెలవడం ధోనీ సేనకు కీలకంగా మారింది.