రాహుల్ విదేశీ పర్యటన గ్రాండ్ మదర్ ని చూసేందుకే

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై బీజేపీ పలు విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాహుల్ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాహుల్ తన గ్రాండ్ మదర్ ని చూసేందుకు మిలన్ (ఇటలీ) వెళ్లారని, అది కూడా తప్పేనా? విదేశీ పర్యటనలు చేయడం అనే విషయంలో ప్రతి ఒక్కరికీ హక్కుంది. బీజేపీ ఈ విషయంలో పరిపక్వతతో కూడిన రాజకీయాలు చేయడం లేదు. బీజేపీ ఒక్క రాహుల్‌నే టార్గెట్ చేస్తోంది. ఎందుకే ఆ ఒక్క నేతనే బీజేపీ టార్గెట్ చేయాలని అనుకుంది. అని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారంనాడు వ్యక్తిగత పని మీద ఇటలీ వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లినదీ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఆయన మిలన్‌ నగరానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అక్కడ ఉన్న తన అమ్మమ్మ వద్దకు రాహుల్‌ వెళ్లారని, త్వరలోనే తిరిగి వచ్చేస్తారని ఆ వర్గాలు వివరించాయి. రైతుల ఆందోళన ఉధృతంగా ఉన్న తరుణంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడంపై కాంగ్రెస్‌లోనే పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి.