సెంట్రల్ మినిస్టర్ ని కలిసిన రైల్వే కోడూరు జనసేన నాయకులు

రైల్వే కోడూరు, ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరుకు విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు నారాయణస్వామిని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర బాబు మర్యాదపూర్వకంగా మండల పరిధిలోని శెట్టిగుంట గ్రామం వద్ద కలిసారు. ఈ సందర్భంగా మంత్రివర్యులను శాలువా కప్పి సత్కరించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను మంత్రికి దినకర బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కాపు యువసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతరాయలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.