జనసేనలో చేరిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం మాజీ చైర్మన్

తిరుపతి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులైన పూతలపట్టు నియోజకవర్గం వాస్తవ్యులు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం మాజీ చైర్మన్ రాజ కుమార్ జనసేనపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా జనసేన పార్టీ పార్టీ కండువ కప్పించుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.