చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘటనపై ఆర్ డి ఓ కి వినతిపత్రమిచ్చిన రామచంద్రపురం జనసేన

రామచంద్రపురం రూరల్ కాపవరం గ్రామంలో ఆరు సంవత్సరాల చిన్నారి బాలికపై జరిగిన హత్యాచారం ఘటనపై రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి రామచంద్రపురం పట్టణములో ఆర్ డి ఓ కి వినతిపత్రం అందజేస్తూ చిన్నారి బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు చింతిస్తూ జనసేన పార్టీ తరఫున పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ డి ఓ కి అభ్యర్థన సమర్పించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక సహాయం 25 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా అందించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం యంత్రాంగం దృష్టి సాధించాలని పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లా వీర మహిళా విభాగం కోఆర్డినేటర్లు చల్లా లక్ష్మి, కడలి ఈశ్వరి ముత్యాల జయలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు బుంగా రాజు, సంపత్, డేగల సతీష్, కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతా బత్తుల విజయ్ కుమార్, గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్, పట్టణ 3వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఎంపిటిసి లు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, వీర మహిళలు దారపు శిరీష, పితాని కరుణ, రమణ కుమారి, సుబ్బలక్ష్మి, కనకరత్నం, వీరవేణి, జనసేన నాయకులు, నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.