శ్రీశ్రీశ్రీ పెద పైడిమాంబ ఉత్సవాలకు రాయపురెడ్డి పదివేల విరాళం

మాడుగుల, చౌడువాడ గ్రామంలో జరిగినటువంటి శ్రీశ్రీశ్రీ పెద పైడిమాంబ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన డీజే కోలాటం కార్యక్రమానికి మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ పాల్గొని ఈ కార్యక్రమానికి 10000/- రూపాయలు చౌడువాడ గ్రామ పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కె. కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు మరియు చౌడువాడ జనసేన నాయకులు నాగులపల్లి మహేష్ గట్టా కాశి, కుంచ మణిశంకర్, గండేపల్లి మహేష్, ముమ్మిన సతీష్, ఎస్.బంగారు నాయుడు, కుంచా రఘు, డి.శివ, జోగా గణేషు, శంకర్, గాడి అంజి, మరియు చౌడువాడ జనసేన నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.