సేవలతోనే గుర్తింపు: పాలవలస యశస్వి

సమాజంలో చేసే సేవలతోనే గుర్తింపు వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. స్థానిక 13వ డివిజన్ కు చెందిన యువనాయకుడు, జనసైనికుడు సారిక విశ్వనాధ్(విశ్వ) సోమవారం రాత్రి కోటవద్ద సుమారు రెండువందల మంది నిరాశ్రయులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీమతి పాలవలస యశస్వి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో చేసిన సేవలను బట్టే గుర్తింపు లభిస్తుందని, తద్వారా ప్రజల గుండెల్లో మంచిస్థానం లభిస్తుందని అన్నారు. ప్రతీఒక్కరూ ఇలాంటి సేవలు అందించాలని కోరారు. అన్నదానం చేసిన విశ్వనాధ్ ను ఆమె అభినందించారు. ఈకార్యక్రమంలో భారీఎత్తున జనసేన నాయకులు, జనసైనుకులు, వీరమహిళలు పాల్గొన్నారు.