బీటెక్ పాసైనవారి కోసం ECIL జాబ్ నోటిఫికేషన్ విడుదల

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్  విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

మొత్తం టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- 350

ఈసీఐఎల్ హైదరాబాద్- 200

ఈసీఐఎల్ బెంగళూరు- 50

ఈసీఐఎల్ న్యూఢిల్లీ- 40

ఈసీఐఎల్ ముంబై- 40

ఈసీఐఎల్ కోల్‌కతా- 20

దరఖాస్తు ప్రారంభ తేదీ- 2020 ఆగస్ట్ 19

దరఖాస్తు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 30 మధ్యాహ్నం 2 గంటలు

అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE ) / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE ) / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ( EIE ) / మెకానికల్ ఇంజనీరింగ్ ( ME) / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ( CSE ) / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( IT ) 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వెబ్ సైట్: https://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లోకి లాగాన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.