మంచినీటి పైపుల లీకేజీలకు మరమ్మత్తు చేయండి: కాశంశెట్టి సుధీర్

ఉరవకొండ: బెలుగుప్ప మండలం, గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీరు సరఫరా చేసే నీటి పైపులో లీకేజీ కావడంతో అక్కడి ఓల్వ్ నీటి గుంతలో నీరు రావడంతో అక్కడ చెత్త పేరుకుపోయి ఆ కాలనీలో త్రాగునీరు వదిలినప్పుడు ఆ చెత్త మొత్తం నీటి పైపుల గుండా ప్రవహించి త్రాగు నీరు కలుషితం అవుతున్నాయి అని కాలనీ వాసులు రెండు నెలలుగా ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా నీటి పైపులను మరమ్మత్తు చేయడం మాత్రం మరిచారు. కావున కాలనీ వాసులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు వెంటనే స్పందించి గుండ్లపల్లి గ్రామ కార్యదర్శిని కలిసి ప్రస్తుత పరిస్థితి గురించి వివరించి వీలైనంత త్వరగా పైపులను మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ సమస్యపై గ్రామ కార్యదర్శి శ్రీరాములు జనసేన పార్టీ నాయకులకు కేవలం మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, చెన్నకేశవ, ప్రహాలద తదితరులు పాల్గొన్నారు.