ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాంపల్లి వెంకట్ జిల్లా నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.