రైతులను వెంటనే ఆదుకోవాలని మామిడికుదురు తాసిల్దారుకి వినతి

పి.గన్నవరం, జనసేన పార్టీ మామిడికుదురు మండల తరుపున మిచౌంగ్ తుఫాను కారణంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను, పంటలను సందర్శించి నష్టపరిహారాన్ని ఇచ్చి రైతులను వెంటనే ఆదుకోవాలని మామిడికుదురు మండల తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస్ రాజా ఎంపీటీసీ సభ్యులు కొమ్ముల జంగమయ్య, కంకిపాటి నర్సింహారావు, బళ్ళ సతీష్, మండల కార్యదర్శులు కాట్రేనిపాడు నాగేంద్ర, గుల్లింకి గంగాధర్, నంబూరి అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.